చెన్నై చంద్రానికి మెగా ఆఫర్.. కొరటాల శివ మూవీలో ఛాన్స్

శనివారం, 28 సెప్టెంబరు 2019 (13:27 IST)
చెన్నై చంద్రంగా పేరుగాంచిన హీరోయిన్ త్రిష. ఒకపుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. కానీ, అవకాశాలు తగ్గిపోవడంతో చెన్నైకే పరిమితమైంది. పైగా, ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ కనిపిస్తోంది. కోలీవుడ్‌లో మాత్రం రాణిస్తున్నప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలో ఈమెకు మెగా ఆఫర్ వరించనుంది. 
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పలువురి పేర్లను పరిశీలించారు. ఈ జాబితాలో అనుష్క, శృతిహాసన్, నయనతార, కాజల్ అగర్వాల్, త్రిష అలా అనేక మంది పేర్లు పరిశీలించినప్పటికీ.. చివరకు ఆ ఆఫర్ చెన్నై చంద్రానికి దక్కినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం త్రిష‌ని చిరు 152వ చిత్ర క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా చేశార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉందో ?
 
కాగా, త్రిష చివరగా "96", 'పేట' చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకి కోలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి 'రాంగి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. మ‌రోవైపు కె తిరుగ‌న‌న‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌ర‌మ‌ప‌దం విల‌య‌ట్టు' అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం త్రిష‌కి 60వ మూవీ కావ‌డం విశేషం. సో... చెన్నై చంద్రం తిరిగి గాడిలో పడినట్టేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు