త్రివిక్రమ్-నాగచైతన్య కాంబినేషన్లో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో మెగా హీరోలచే హిట్ కొట్టిన త్రివిక్రమ్.. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీపై పడ్డాడు. ఏ మాయ చేసావె ద్వారా మంచి పేరు సంపాదించుకుని మాస్ హీరోగా ముద్రవేసుకున్న నాగచైతన్యతో కలిసి సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. ఇందుకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.