మొదట్లో పూరీ జగన్నాథ్ తో ‘ఆటోజానీ’ సినిమా తీస్తున్నట్లు ఈ సినిమా రాంచరణ్ నిర్మించనున్నట్లు ఆ తెగ వార్తలు వచ్చాయి. కానీ అది క్యాన్సల్ కావడంతో మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘కత్తి’ రిమేక్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కానీ మొన్నామద్య వచ్చిన ‘అఖిల్’ అపజయంతో చిరంజీవి మళ్లీ డైలమాలో పడ్డట్లు తెలిసింది. దీంతో వివివినాయక్ని కూడా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు హిట్ సినిమాల దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ కోట్టేశాడని ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా చిరుకు కథ వినిపించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్-సమంతలకు ''అ...... ఆ '' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి లేదా రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం ఉంది.