రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులపై అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిద్దరూ షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజీ ప్రాంగణంలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వెంటనే అజయ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ గోస్వామి తెలిపారు.