మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది: బాలయ్య (video)

శనివారం, 5 నవంబరు 2022 (11:28 IST)
Balakrishna
నందమూరి హీరో బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ 2 షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మూడవ ఎపిసోడ్‌లో కుర్ర హీరోలు అడవి శేష్, శర్వానంద్ హాజరయ్యారు. ఈ షోలో ఆ హీరోల బాలయ్య యాంకరింగ్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ షోలో బాలయ్య తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. 
 
శర్వానంద్ జోకుగా ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశారు కదా.. ఎలాంటి అఫైర్స్.. రూమర్స్ లేకుండా ఎలా మేనేజ్ చేశారంటూ అడిగాడు. అందుకు బాలయ్య ఘాటుగా సమాధానం ఇస్తూ.. "మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది" అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యాకు. 
 
నిజం చెప్పాలంటే అప్పట్లో సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. హీరోల గురించి, సినిమాల గురించి అప్పుడప్పుడు పేపర్‌లో వచ్చినప్పుడు చూడడమే తప్ప జనాలకు ఏది తెలిసేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యంతో సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పాలి.  

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు