విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా నటిస్తున్న తాజా చిత్రం "బాబు బంగారం''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ కామెడి పోలీల్ ఆఫీసర్గా నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో ఓ సదా సీదా బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించనుందట.
ప్రస్తుతం పాటల షూట్ చేసుకునే పనిలో ఈ చిత్ర బృందం స్పెయిన్కు వెళ్లింది. అక్కడ అందమైన లొకేషన్స్లో పాటలను చిత్రీకరించనున్నారు. గతంలో వెంకటేష్, నయనతారలు "లక్ష్మి'', ''తులసి'' చిత్రాల్లో జంటగా నటించారు. కాగా ''తులసి'' చిత్రంలోని పలు పాటలను స్పెయిన్లోనే చిత్రీకరించిన విషయం తెలిసిందే.