జాన్వీపై మనసుపారేసుకున్నా... తప్పకుండా చేస్తా : టాక్సీవాలా

గురువారం, 29 నవంబరు 2018 (18:02 IST)
అతిలోకసుందరి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్. 'దఢక్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఈమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. కానీ, జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
నిజానికి టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ జాన్వీకి రాగా, ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకొచ్చింది. కానీ, ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే ఏ నటుడిగా మారాలని అనుకుంటున్నావు.. ఎందుకు అనే ప్రశ్న జాన్వీకి ఎదురైంది. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అంటే తెలుగు వెండితెరపై కనిపించేందుకు తనకు సరైన జోడీ విజయ్ దేవరకొండేనని ఆమె భావిస్తున్నట్టుగా ఉంది. 
 
ఇదే అంశాన్ని విజయ్ దేవరకొండ వద్ద మీడియా ప్రస్తావించింది. దీనికి ఈ టాక్సీవాలా సమాధానమిస్తూ, "నేను కూడా జాన్వితో, కరణ్ జోహార్‌తో కలిసి అతి త్వరలో పనిచేస్తా. జాన్వీతో నటించాలని నాకూ ఆశగా ఉంద"ని చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, ఇటీవల తాను ముంబైకు వెళ్లి కరణ్ జోహార్ ఆఫీసుకు వెళ్లాను. ఆయన ఆఫీస్‌లో కూర్చొన్నపుడు నేనేంటి ఇక్కడ? అనిపించింది అని విజయ్ వెల్లడించారు. అందువల్ల తమ కాంబినేషన్‌లో తప్పకుండా చిత్రం ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా, విజయ్ నటించిన తాజా చిత్రం 'టాక్సీవాలా'. ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇపుడు "డియర్ కామ్రేడ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు