టాలీవుడ్ అగ్రహీరోలు తన కథతో సినిమా చేయాలనుకోవడం లేదని బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాన్ని తెలియజేశారు. బాహుబలి బిగినెంగ్లో డ్రామా లేదనీ, బాహుబలి కంక్లూజన్లో అంతా డ్రామానే ఉంటుందన్నారు. శివగామి, దేవసేన మధ్య సన్నివేశాలు గుండెల్ని హత్తుకుంటాయని చెప్పుకొచ్చారు.