శ్రీదేవి బంగ్లాలో బాత్ టబ్‌లో పడి చచ్చిపోయింది... గడ్డిపోచలా బోనీ నోటీస్...(Video)

శుక్రవారం, 18 జనవరి 2019 (19:14 IST)
వెండితెర అందాల నటి శ్రీదేవి దుబాయ్ హోటల్‌లో అనూహ్యంగా వాటర్ టబ్‌లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చనిపోవడానికి కారణం అక్కడి హోటల్ యాజమాన్యం చెప్పింది. ఐతే ఇపుడు ఇదే అంశం ప్రతిబింబించేలా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనితో ఈ చిత్రంపై శ్రీదేవి భర్త ఆ చిత్ర దర్శకుడు, నటికి ఏకంగా నోటీసులు జారీ చేశారు. వాటిని దర్శకుడు గడ్డిపోచలా కొట్టి పడేశాడు. అసలు ఇందులోవున్న మతలబు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
కన్నుగీటి కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఈ మలయాళ నటి హీరోయిన్‌గా "శ్రీదేవి బంగ్లా" అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వవహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా ఈ చిత్ర కథ శ్రీదేవి బయోపిక్ అని స్ఫురిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్లో శ్రీదేవి 16 ఏళ్ల వయసులో ఎలా ఎగురుతూ హుషారుగా నటిస్తుందో హీరోయిన్ కూడా అలాగే కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా అనేక షేడ్లలో కనిపిస్తుంది. చివరికి ముగింపులో హీరోయిన్ వాటర్ టబ్‌లో పడి చనిపోతుంది. దీంతో ఇది శ్రీదేవి బయోపిక్ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ప్రియాకు, డైరెక్టర్ ప్రశాంత్ మాంబుల్లికి శ్రీదేవి భర్త నోటీసులు పంపటంతో.. ఈ వివాదంపై టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
 
ఈ పరిస్థితుల్లో శ్రీదేవి బంగ్లాపై దర్శకుడు ప్రశాంత్, నటి ప్రియా వారియర్ కూడా స్పందించారు. 'చిత్ర టైటిల్‌లో శ్రీదేవి పేరును మార్చడంతో పాటు కొన్ని సన్నివేశాలు మార్పులు చేయాలనే విధంగా శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ మాకు నోటీసులు పంపారు. ఎవరి బయోపిక్‌ అయినా తెరకెక్కించాలంటే అనుమతులు తీసుకోవాలన్న విషయం మాకు తెలుసన్నారు. 
 
కానీ, ఈ చిత్రాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిస్తున్నాం. సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పగలమా? ఈ సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పాలంటే కుదరదు. నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో ‌పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? ఈ చిత్రంలో హీరోయిన్ కూడా బాత్ టబ్‌లో పడి చనిపోతుంది. ఐతే ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 
 
మరోవైపు, ప్రియా ప్రకాష్ వారియర్ స్పందిస్తూ, 'శ్రేదేవి అనేది ఈ సినిమాలో నా పేరు మాత్రమే. దానికే ఇంత రాద్ధాంతం అవసరమా?. ప్రస్తుతం ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం శ్రేదేవి నేపథ్యంలో ఉందా? లేదా? అనేది విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్తారు' అని వ్యాఖ్యానించింది. చూడండి ట్రెయిలర్.. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు