విక్టరీ వెంకటేష్, సూపర్స్టార్ మహేష్ కాంబినేషన్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగులో నిర్మాణమవుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం రెండు పాటలు మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ 15న హైదరాబాద్లో ఈ చిత్రం ఆడియో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ - ''రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భద్రాచలం దేవాలయ ప్రాంగణం సెట్లో ప్రధాన తారాణం, వేలాది మంది జనం మధ్య క్లైమాక్స్ సన్నివేశాలు చాలా భారీ ఎత్తున చిత్రీకరిచడం జరిగింది. దీంతో రెండు పాటలు మినహా టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. డిసెంబర్ 15న హైదరాబాద్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.