"పైసా వసూల్" తేడా... జనాలకెక్కని సినిమా...

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:41 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పైసా వసూల్". ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హీరో పేరు తేడా సింగ్. పేరులో ఎలా తేడా ఉందో చిత్ర కథ కూడా తేడాగానే ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ జనాలకెక్కేలా కనిపించదు. 
 
కథను పరిశీలిస్తే.. ఈ చిత్రంలో హీరో ఓ రా అధికారి. ఈ విషయం చివరివరకు తెలియదు. అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఆ సమయంలో హీరో పేరు తేడా సింగ్. పేరుకు తగ్గట్టుగానే అతని చేష్టలు కూడా ఉంటాయి. పైగా, క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. 
 
ఈ క్రమంలో హీరోయిన్ శ్రియ జర్నలిస్టు. ఈమె కుటుంబంపై మాఫియా డాన్ దాడి చేసి, చెల్లెల్ని చంపేసేందుకు ప్రయత్నిస్తాడు. దీన్ని తేడా సింగ్ అడ్డుకుంటాడు. ఆ తర్వత మాఫియా డాన్ చరిత్రను తెలుసుకునేందుకు పోర్చుగల్‌కు శ్రియ వెళుతుంది. 
 
అక్కడ అతని గుట్టు తెలుసుకునేలోపు.. డాన్ మనుషులు ఈమెను గుర్తించి అటాక్ చేస్తారు. అపుడు క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న తేడా సింగ్ రక్షిస్తాడు. దీంతో వీరిద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత డాన్‌ను హీరో చంపేస్తాడు. ఒక 'రా' ఆఫీసర్‌గా డ్యూటీలో చేయలేని పనిని నాన్ డ్యూటీలో పూర్తి చేస్తాడు. 
 
వాస్తవానికి ఈ చిత్ర కథ హీరో రవితేజకు పక్కాగా సూటయ్యేది. కానీ, పూరీ జగన్నాథ్ కథ వినిపించగానే బాలయ్య ఎలా అంగీకరించాడే అర్థంకాదు. పైగా, బాలయ్య - పూరీ జగన్నాథ్ కాంబినేషనే ఓ పెద్ద తేడాగా ఉందని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ చిత్రం చూశాక నిజంగానే ఈ కాంబినేషన్‌తో పాటు.. చిత్రం పెద్ద తేడాగా ఉందని తేలింది. 
 
విశ్లేషణ : పెండ్యాల 

వెబ్దునియా పై చదవండి