సకల వేదాలకు మూలపురుషుడు, కలియుగ వైకుంఠనాథుడు మలయప్ప తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగిన తీరు భక్తులను కనువిందు చేసింది. మూలవిరాట్టునికి మాత్రమే అలంకరించే విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన వెంకన్నకు కొత్త కళ సంతరించుకుంది.
నిత్యసేవల స్వామి సన్నిధిల్లో మూలమూర్తికి మాత్రమే అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి, సహస్రనామావళి హారం, ముఖ్యమంత్రి అందజేసిన కొత్త మేల్ చాట్ వస్త్రాలంకృతులతో ముస్తాబైన శ్రీవారు కొత్తపెళ్లికొడుకువోలే దర్శనమిచ్చారు. శ్రీవారి గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యారు