పనీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాడు..

మంగళవారం, 11 జులై 2023 (18:31 IST)
ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆర్డర్ మారుతుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన అశ్విని శ్రీనివాసన్ తన ట్విట్టర్ ఖాతాలో తన స్నేహితుడు జొమోటో ద్వారా అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ బిర్యానీ దుకాణంలో రూ.1228కి పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశానని పోస్ట్ చేశాడు. వారు శాకాహారులు. మొదట్లో పనీర్‌ బిర్యానీ అని భావించి, కుటుంబ సభ్యులు తిన్నప్పుడే అది చికెన్‌ అని తెలిసింది. 
 
పన్నీర్ బిర్యానీ స్థానంలో చికెన్ బిర్యానీ రావడం బాధాకరం. ఆర్డర్ డెలివరీ చేసిన ఉద్యోగిని సంప్రదించిన వెంటనే, అతను సంబంధిత రెస్టారెంట్‌లో అడగవలసి ఉంటుందని తెలిపాడు. అయితే వారు కూడా సరైన సమాధానం చెప్పలేదు. దీనికి బాధ్యులెవరు? అన్నారు. 
 
ఈ పోస్టును చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జొమోటాకు మద్దతుగా, మరికొందరు కస్టమర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు