అన్నా లెజినోవా స్నాతకోత్సవం.. పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ వైరల్- బాబు కంగ్రాట్స్ (video)

సెల్వి

శనివారం, 20 జులై 2024 (23:09 IST)
Anna_Pawan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన తన భార్య అన్నా లెజినోవా స్నాతకోత్సవానికి హాజరయ్యారు. అన్నా లెజినోవా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకున్నారు. ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారించి ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 
 
ఈ సందర్భంగా డిగ్రీ సాధించిన తన భార్యతో కలిసి పవన్ ఫోజులిచ్చారు. వారి సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నా లెజినోవా సాధించిన విజయానికి అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

Congratulations to Anna Lezhneva Garu on completing her Master’s in Arts from the University of Singapore. Your achievement is remarkable and it will serve as an inspiration to all, especially those sisters and daughters of Andhra Pradesh, who wish to pursue academics while… pic.twitter.com/YQpTcj5juf

— N Chandrababu Naidu (@ncbn) July 20, 2024
దీనికి ముందు, అన్నా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నారు. బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం నుండి థాయ్ అధ్యయనాలలో తన మొదటి మాస్టర్స్ డిగ్రీని పొందారు. 
 
పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవా 2011లో తీన్మార్ చిత్రంలో కలిసి పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. వారు 2013 లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి, ఆమె భారతీయ సంస్కృతికి గౌరవమిస్తూ.. తరచుగా బహిరంగ కార్యక్రమాలలో చీరలు ధరించడం కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు