వాస్తుప్రకారం భూ పరీక్ష!

గురువారం, 10 జులై 2008 (18:06 IST)
WD
గృహనిర్మాణం చేయడానికి ముందు భూమిని ఓ సారి పరీక్షించి తర్వాతే ఇంటి నిర్మాణం చేపట్టాలని వాస్తునిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణంలో భూపరీక్ష చాలా ముఖ్యమైందని వారు అంటున్నారు. వాస్తునిపుణుల సూచనల మేరకు గృహనిర్మాణంలో భూపరీక్ష నియమాలు కొన్నింటిని పరిశీలిద్దామా... గురువింద, మల్లె, మోదుగ, తెల్లగన్నేరు, అరటి, పనస వంటి వృక్షములు సస్యశ్యామలంగా ఉన్నట్లైతే ఆ భూముల్లో ఇంటి నిర్మాణం చేయొచ్చు.

అదే విధంగా ముంగిసలు, కుందేళ్లు, చక్రవాకములు, తోడేళ్ళు, పిల్లులు, గోవులు, ఉడుతలు వంటి పక్షి సంతతి తిరుగుతుండే భూములు కూడా గృహనిర్మాణానికి శ్రేష్టమైనవని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.

ఇలాంటి ప్రాంతాల్లో ఇంటినిర్మాణం చేపట్టినట్లైతే సర్వశుభాలు చేకూరుతాయని వారు అంటున్నారు. అంతేకాకుండా అన్నవస్త్రములు, ఆయురారోగ్యములు, సకలార్థసంపదలు ఆ గృహంలో నివసించే వారు కలిగి ఉంటారని వారు పేర్కొంటున్నారు.

అయితే చీమల, పాముల పుట్టలు, కప్పలు, ఎముకలు, బూడిద, కాలిపోయిన వస్తువులు గల భూములయందు గృహనిర్మాణములు చేపట్టరాదు. అలా నిర్మించినట్లైతే మరణ-రోగములు కలుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గోరీలు, సమాధులు, ముండ్లుగల వృక్షములుండుట, బీటలు వారి ఉండుట వంటి భూములు కూడా ఇంటినిర్మాణానికి పనికి రావని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి