మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?

బుధవారం, 14 జూన్ 2023 (10:36 IST)
మహాలయ పక్షంలో చాలా ముఖ్యమైన అంశం అన్నదానం. దంపతులిద్దరూ తమ చేతులారా ఇతరులకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. 
 
అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. ఇంకా పేదలకు అన్నం దానం చేస్తే, పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేతులారా వండిన అన్నాన్ని అన్నదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ అన్నదానంలో నువ్వుల ఉండలు, అరిసెలు, గారెలు, కొబ్బరి పాలు వుండేలా తీసుకోవాలి. అలాగే పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను అన్నదానంతో కలిపి పంచడం చేస్తే విశిష్ట ఫలితాలు చేకూరుతాయి. 
 
కర్ణుడు దాన కర్ణుడిగా పేరు సంపాదించాడు. ఎవరు ఏమి అడిగానా లేదని చెప్పకుండా దానం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అన్నదానం చేయలేదు. 
 
అతని మరణానికి తర్వాత 14 రోజులు భూలోకానికి వెళ్లి అన్నదానం, తర్పణం, శ్రాద్ధం మొదలైనవాటిని చేసి పెట్టి తిరిగి స్వర్గం పొందాడు. ఆ 14 రోజులు తాను మహాలయ పక్ష దినంగా పరిగణిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు