కావలసిన పదార్థాలు : బూడిద గుమ్మడికాయ... అరకేజీ అరటికాయ... ఒకటి కంద లేదా బంగాళాదుంపలు.. వంద గ్రా. గోరుచిక్కుడు లేదా బీన్స్... వంద గ్రా. క్యారెట్లు.. రెండు ములక్కాడలు... రెండు పచ్చికొబ్బరి చిప్ప... ఒకటి ఉప్పు... తగినంత నూనె లేదా నెయ్యి... నాలుగు టీ. పెరుగు... ఒక కప్పు పచ్చిమిరపకాయలు... ఎనిమిది
తయారీ విధానం : ముందుగా కూరగాయలన్నింటినీ కడిగి, చెక్కుతీసి సన్నగా తరిగి ఉప్పువేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఆవిరి అంతా పోయిన తరువాత కుక్కర్ మూత తీసివేసి అందులో మెత్తగా రుబ్బుకున్న పచ్చికొబ్బరి, పచ్చిమిరపకాయల ముద్దను వేసి మరికాసేపు ఉడికించాలి.
ఈ కూర కాసేపు చల్లారిన తరువాత పెరుగు, నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నూనె ఇష్టం లేనివారు నెయ్యి వాడవచ్చు. ఈ కేరళ వంటకం అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.