తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులో అల్లం వల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన టమోటోలు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు.. మసాలా దినుసులు వేసి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
ఈ మిశ్రమంలోనే బంగాళదుంప ముక్కలు, ఎండుమిర్చి కూడావేసి తక్కువ మంట పై వేపుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిపెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోసి ఒక్క విజిల్స్ వచ్చే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును గార్నిష్గా చిలకరించాలి. ఈ రైస్కు చికెన్ గ్రేవీ సూపర్ కాంబినేషన్ అవుతుంది.