తయారీ విధానం : ముందుగా రాజ్మాను ఆరు గంటల పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు మరియు టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేయాలి. వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
అందులో టమోటో గుజ్జు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై అయిన తర్వాత అందులో రాజ్మా ఉడికించిన నీటిని పోసి బాగా మిక్స్ చేయాలి. పన్నీర్ మెత్తగా ఉడికే సమయంలో అందులో రాజ్మ, గరం మసాలా కూడా వేసి మంటను మీడియంగా పెట్టి ఉడికించుకోవాలి. 10నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్, రాజ్మా కర్రీ రెడీ..