తక్కువ వెలుగులో చదివితే అంతే సంగతులని ఐ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుస్తకాలు చదివేటప్పుడు తగినంత వెలుగు ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెలుగులో చదివితే కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు చదివే అలవాటుంటే మానుకోవాలి.
ప్రయాణంలో పుస్తకం లేదా పేపర్ కదులుతూ ఉంటుంది. అలా కదులుతున్న అక్షరాల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. కాబట్టి తక్కువ వెలుగులో ప్రయాణాల్లో చదవక పోవడమే మంచిది.
కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలి. విటమిన్-ఎ ఎక్కువగా ఉండే సహజసిద్ధమైన ఆహారాన్ని తినాలి. ఇందుకోసం బచ్చలికూర, క్యారెట్, టమోటా, పాలు, ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తాజా ఆకుకూరలు ప్రతీరోజూ ఏదో ఓ రూపంలో తీసుకోవాలని ఐ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.