చాలామంది మహిళలు తమ ముఖ సౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత వారి కాళ్ళకు ఇవ్వరు. చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలాముఖ్యం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు కాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాళ్ళలో చేరుకున్న మురికి, కాలి వేళ్లల్లో చేరుకున్న మురికిని తొలగించుకునేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికి పెడిక్యూర్ మాత్రమే ఓ మంచి ఉపాయం.
పెడిక్యూర్ చేసే విధానం:
ఒక టబ్లో గోరువెచ్చని నీటిని వేసుకోండి. అందులో షాంపూ, హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు అమ్మోనియా కలుపుకుని 15-20నిమిషాలపాటు మీ కాళ్ళను అందులో ఉంచండి. దీంతో కాళ్ళ పగుళ్ళలో చేరుకున్న మురికి బయటకు వచ్చేస్తుంది.