ఆ విషయంలో మహిళలే బెస్ట్.. వారితోనే లాభాల పంట!

సోమవారం, 21 సెప్టెంబరు 2015 (12:11 IST)
మహిళా నాయకత్వంలోనే లాభాల పంట సాధ్యమవుతుందని క్రెడిట్ స్విస్ నివేదిక వెల్లడించింది. కంపెనీల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తే లాభాల పంట పండిస్తారని.. పోటీ కంపెనీలతో తమ కంపెనీని లాభాల్లో ముందుకు తీసుకొస్తారని క్రెడిట్ స్విస్ అధ్యయన నివేదిక చెబుతోంది. 
 
కంపెనీలకు చెందిన బోర్డుల్లో మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా వాటాదారులకు ఎక్కువ డివిడెండ్లు ఇవ్వడానికి, అధిక రాబడులను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్రెడిట్ స్విస్ అనే సంస్థ పేర్కొంది. మహిళలు ఆర్థిక విషయాల్లో పాత సంప్రదాయ ధోరణులనే అనుసరిస్తారన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని, నూతన ఒరవడితో మహిళలు ముందడుగు వేస్తున్నారని పేర్కొంది. 
 
3వేల కంపెనీల్లోని 28వేల మంది సీనియర్ మేనేజర్ల అభిప్రాయాలను తీసుకుని క్రెడిట్ స్విస్ ఈ నివేదికను రూపొందించింది. ఈ కంపెనీల్లో భారత్‌లోని కంపెనీలు కూడా ఉన్నాయి. కొత్తగా ఆవిర్భవిస్తున్న కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం బాగానే పెరుగుతోందని ఆ నివేదిక తెలిపింది.

వెబ్దునియా పై చదవండి