బీజేపీ ఎంపీల సతీమణులంతా కలిసి ఏర్పాటు చేసిన సంఘమిది. భర్తకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటూ వివాదాలకు దూరంగా నడిపించడం సభ్యుల లక్ష్యమట. అంతటితోనే ఆగరట.. స్వచ్ఛంద సేవ కూడా చేస్తామంటున్నారు. ఇందులో బీజేపీ మహిళా ఎంపీలు కూడా సభ్యులుగా వున్నారు. కొన్ని నిర్ధిష్టమైన విధివిధానాలతో కార్యాచరణ కూడా ప్రకటించారు.
ముఖ్యంగా తమతమ భర్తలకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉండి వివాదాలకు దూరంగా ఉండేలా నడిపించడం వీరి ప్రధాన కర్తవ్యం. ఇక మీడియాతో మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టింగ్ ఆపరేషన్ల బారిన పడకుండా తమ భర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారట కమలసఖి సభ్యులు.