కామన్వెల్త్ క్రీడలు: ఫైనల్‌లో బోల్తా పడిన సానియా

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల సింగిల్ టెన్నిస్ ఫైనల్ పోటీలో హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓటమిపాలైంది. అనస్తాసియా రొడియోనోవా చేతిలో 6-6, 6-2, 6-7 (3) సెట్ల తేడాతో ఓటమి పాలైంది.

కామన్వెల్త్ క్రీడల్లో టెన్నిస్ పోటీలను ఈ యేడాది తొలిసారి ప్రవేశపెట్టారు. ఈ పోటీల్లో తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న క్రీడాకారిణిగా రొడియోనోవా రికార్డు సృష్టించారు. దీంతో సానియా మీర్జా వెండి పతకంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి