న్యూఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో నేడు జరిగే పోటీలు ఇవే!!

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 19వ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భాగంగా చివరి రోజైన గురువారం కొన్ని కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం అథ్లెటిక్ విభాగంలో మారథాన్ పోటీలు ఉదయం 6.30 నుంచి 9.30 గంటల వరకు జరుగుతాయి.

అలాగే, ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు బ్యాడ్మింటన్, ఉదయం 11 నుంచి 12 వరకు జిమ్మాస్టిక్స్ (రిథమిక్) పోటీలు జరుగుతాయి. వీటితోపాటు ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు హాకీ పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నెట్‌బాల్ పోటీలు, టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి