బ్యాడ్మింటన్ పోటీల్లో భారత క్రీడాకారుల ముందంజ

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ముందడుగు వేస్తున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. మహిళల సింగిల్స్‌లో పూణెకు చెందిన అదితి, శ్రీలంకకు చెందిన సుబోధ్ కుమారిపై 21-14, 21-7 తేడాతో విజయం సాధించింది.

అదేవిధంగా పురుషుల సింగిల్స్‌లో మనదేశానికి చెందిన కస్యప్, జమైకా క్రీడాకారుడు ఫైనెను 21-5, 21-12 స్కోరు తేడాతో మట్టికరిపించాడు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాలా, దిజుల జంట.. జమైకాకు చెందిన హెన్రీ గరేథ్ ఆండ్రే థియోడర్-క్రిస్టల్ కర్జోన్ జోడీని ఓడించారు. ఆద్యంతం మెరుగ్గా ఆడిన జ్వాలా-దిజుల జోడీ 21-13, 21-8 తేడాతో గెలుపును నమోదు చేసుకుని తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు.

వెబ్దునియా పై చదవండి