సీడబ్ల్యూజీ: బ్యాడ్మింటన్‌లో జ్వాలా-అశ్వినిలకు 'బంగారం'

కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భాగంగా గురువారం జరిగిన బ్యాడ్మింటన్ పోటీల మహిళా విభాగంలో భారత్‌కు స్వర్ణపతకం లభించింది. ఈ విభాగంలో బరిలోకి దిగిన భారత క్రీడాకారిణులైన జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పలు సింగపూర్‌ ద్వయం సారి షాంతి ములియా, యావో లైపై వరుస సెట్లలో విజయం సాధించారు. దీంతో కామన్వెల్త్ క్రీడా చరిత్రలో బంగారు పతకాన్ని భారత్‌కు అందించిన జంటగా జ్వాలా-అశ్వినిలు రికార్డు సృష్టించారు.

ఈ మ్యాచ్‌లో వీరిద్దరు 21-16, 21-19 సెట్ల స్కోరుతో విజయం సాధించారు. మొదటి గేమ్‌లో భారత జంట 0-3 తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత పుంజుకున్న ఈ జంట 5-5తో సమం చేశారు. జ్వాలా అద్భుతమైన సర్వీసులతో ఎదురుదాడికి దిగి ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టారు.

వెబ్దునియా పై చదవండి