దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, మాజీ ఆటగాళ్లకు భయం పుట్టుకొచ్చినట్లుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు వింటే చాలు పాక్ క్రికెటర్లకు, అభిమానులకు చమటలు పడుతున్నాయి. యధావిధిగా ఈసారి కూడా భారత్పై గెలుపు మాదే అంటూ ముందే మైండ్ గేమ్ మొదలెట్టాల్సిన పాకిస్తాన్ జట్టు, దాని అభిమానులు ధోనీ దెబ్బ కాచుకుంటే చాలు.. గండం గడిచినట్లే అంటూ జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు.
టి ఎవరూ లేరంటూ పాక్ జట్టుకు దాని మాజీ క్రికెటర్లు ముందుస్తుగా హెచ్చరికలు చెబుతున్నారంటే ధోనీ పాక్ గుండెల్లో రేపుతున్నభయం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మైదానంలో ధోనీ పాత్రను అతడు కలిగించే ప్రభావాన్ని ప్రశంసించడంలో కూడా పాక్ మాజీ క్రికెటర్లు వెనక్కు తగ్గడం లేదు. పాక్ నుంచి ఇటీవలి కాలంలో దాయాది దేశానికి చెందిన ఆటగాళ్ల ప్రతిభకు ప్రశంసలు దక్కడం ఇద్దరి విషయంలేనే జరిగింది. వారు కోహ్లీ, ధోనీ.
తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సొహైల్ పాక్ అటగాళ్లను ధోనీ విషయమై తీవ్రంగా హెచ్చరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్తో జరిగే కీలక పోరులో మహేంద్ర సింగ్ ధోనితో జాగ్రత్తగా ఉండాలని అమీర్ సొహైల్ తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. అదే సమయంలో మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేరంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాడు.