పవన్ కళ్యాణ్తో కలిసి నటించే అవకాశం కోసం ఆయన ఫ్యాన్స్ నుంచే తీసుకోవాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతుంది.
అందులో జర్నలిస్టులు కొంతమందిని ఫ్యాన్స్ను ఎంపిక చేశారు. ఇది కాకుండా క్లెమాక్స్లో పవన్తో నడిచే సన్నివేశముంది. దానికి మరికొంతమంది ఫ్యాన్స్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే అభిమానుల్ని కలిసి ఎంపిక చేసే సెటప్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిచేస్తానని పూరీ చెప్పారు.
యూనివర్సిల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.