ప్రభాస్ 'మిర్చి' కథ అవుట్... ప్రభాస్ ఆర్కిటెక్ట్... ఇంకా అనుష్క..?!!

గురువారం, 7 ఫిబ్రవరి 2013 (21:03 IST)
WD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ 'మిర్చి' కథ అవుట్ అయింది, కాగా 'మిర్చి' ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇంతకుముందు చిత్రాలకంటే మిర్చిపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత చిత్రం రెబల్ బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో ప్రభాస్ తన ఆశలన్నిటినీ మిర్చిపై పెట్టుకున్నాడు.

ఇకపోతే ప్రభాస్ మిర్చి కథ టాలీవుడ్‌లో అవుట్ అయింది. ఈ కథ ప్రకారం, ప్రభాస్ పేరు జై. అతడు ఇటలీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటాడు. ఐతే కొన్ని సమస్యల వల్ల బలవంతంగా భారతదేశానికి రావలసివస్తుంది. అలా ఇటలీ నుంచి వచ్చిన అతడు సమస్యలను ఎలా పరిష్కరించాడు...? వెన్నెల(అనుష్క), మానస(రిచా గంగోపాధ్యాయ) పాత్రలు ఏమిటి? వీరిద్దరిలో జై ఎవరిని ప్రేమించాడు? అనే 'మిర్చి' ఘాటుతో కథ సాగిపోతుంది.

వెబ్దునియా పై చదవండి