'ఇద్దరమ్మాయిలతో' 3 రీళ్లు చూసి తట్టుకోలేకపోయా... దిల్ రాజు

గురువారం, 30 మే 2013 (17:31 IST)
WD
'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ 3 రీళ్లు దిల్ రాజుకు చూపించాడట. అది చూసి తట్టుకోలేకపోయాడట దిల్ రాజు. దీంతో అల్లు అర్జన్‌తో పర్సనల్‌గా చాలా మాట్లాడాట. అదీ నాలుగు గోడల మధ్యన. ఎవరైనా నాలుగు గోడలమధ్య మాట్లాడుకునేవి, చేసేవి సీక్రెట్‌గా ఉంచుతారు. ఇద్దరు వ్యక్తులు కలిసి చాలా సరదాగా మాట్లాడుకుంటే వారి భాష ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అంటే పచ్చిబూతులుగా మాట్లాడుకుంటారు. అల్లు అర్జున్‌ విషయంలో అదే జరిగింది. ఆయనతో నిర్మాత దిల్‌రాజు చాలా సరదాగా ఉంటారట. ఇద్దరూ ఫ్రెండ్స్‌లా ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుకుంటుంటారు.

ఈ విషయాన్ని దిల్‌రాజు స్వయంగా చెప్పారు. బన్నీకి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. ఒకసారి 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూపించాడు. మొత్తం చూపించలేదు. మూడు రీల్స్‌ చూపించాడు. అది చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే బండ్ల గణేష్‌కు ఫోన్‌ చేసి.. పూరీ జగన్నాథ్ ఏదో మ్యాజిక్‌ చేశాడు. మూడు రీళ్లు చూస్తేనే ఇలా ఉంటే సినిమా మొత్తం అదిరిపాటుగా ఉంటుంది అన్నారు.

దీనికి కౌంటర్‌గా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ... దిల్‌ రాజు నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ఎందుకనో మాకు సింక్‌ అయింది. ఫలానా సినిమా ఎందుకు చేశావ్‌. ఆ సినిమాలో ఇలా చేస్తే బాగుండేది.. అంటూ సూచనలు కూడా ఇస్తాడు. కానీ మేం మాట్లాడుకునేవి నాలుగు గోడల మధ్య సాగే భాషే ఉంటుంది. అవి నాలుగు గోడల మధ్యనే ఉండాలి. బయట మాట్లాడకూడదు అంటూ ముగించారు. ఇకపోతే ఇద్దరమ్మాయిలతో సినిమా 31 శుక్రవారం విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి