మంచు లక్ష్మీప్రసన్నను ఫాలో అవుతున్న నరేంద్రమోడీ...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (17:12 IST)
WD
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న ఇప్పుడు ఆకాశంలో విహరిస్తోంది. కారణం ... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని లక్షలాది మంది ఫాలో అవుతుంటే, ఆమెను మోడీ ఫాలో అవుతున్నారు. అవును ... మంచు లక్ష్మీని ట్విట్టెర్‌లో మోడీ ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ప్రస్తావిస్తూ, "మోడీగారు నన్ను ఫాలో అవడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్నీ కూడా కలిగిస్తోంది. మరోపక్క గర్వంగా కూడా వుంది. కేవలం 600 మందిని మాత్రమే ఫాలో అయ్యే మోడీగారు రాఖీ పండుగ నుంచి మరో 28 మంది మహిళలను గౌరవపూర్వకంగా ఫాలో అవుతున్నారు. ఆ 28 మందిలో నేనుండడం చాలా గర్వంగా వుంది" అంటోంది లక్ష్మి.

ఇటీవల మోడీ హైదరాబాదు వచ్చిన సందర్భంగా మంచు లక్ష్మి ఆయనను గౌరవపూర్వకంగా కలిసి చాలా సేపు మాట్లాడింది. ఆ సమయంలో ఆమె వాక్పటిమకు, నాలేడ్జికీ మోడీ ఆశ్చర్యపోయారట.

వెబ్దునియా పై చదవండి