పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!

శుక్రవారం, 14 మార్చి 2014 (12:10 IST)
FILE
ఎవడు సినిమా తర్వాత రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్, కమలిని ముఖర్జీలు కూడా ప్రధాన భూమిక పోషించనున్నారు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో ప్రకృతి అందాల నడుమ చరణ్, కాజల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తవగానే ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ నెల 26 వరకు అక్కడే షెడ్యూల్ కొనసాగుతుంది. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు నిండిన కథతో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నాడు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి