అల్లరోడికి 'బిస్కెట్‌' వేసిన డైరక్టర్ వీరభద్రమ్‌!

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (12:52 IST)
FILE
ఎవరినైనా బుట్టలో వేయాలంటే, సోపు వేస్తున్నాడంటారు. ఇండస్ట్రీలో దీనిపై చాలా పదాలున్నాయి. అందులో బిస్కెట్‌ వేయకురా అంటుంటారు. ఇప్పుడు దాన్నే టైటిల్‌గా తీసుకుని దర్శకుడు వీరభద్రమ్‌ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన ఈ చిత్రానికి బిస్కెట్ రాజా అనే టైటిల్ అనుకుంటున్నారు. తొలుత ఈ సినిమాకి ఇద్దరు హీరోలను అనుకున్నారు.

ముందుగా వారు డేట్స్‌ ఇచ్చారు, కానీ 'భాయ్‌' సినిమా అట్టర్‌ప్లాప్‌ కావడంతో వారు వెనక్కువెళ్లినట్లు తెలిసింది. అందుకే తను నమ్ముకున్న గురువుగారి అబ్బాయి అల్లరి నరేష్‌తో కథ చెప్పడానికి రెడీ అయ్యాడు. నరేష్ టైటిల్‌ చూసి ఫ్లాట్‌ అయ్యాడట. కథ కూడా ఇంట్రస్ట్‌గా ఉండడంతో 'ఆహనాపెళ్ళంట' తర్వాత మరో ప్రయత్నం నరేష్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పుల్లారావు నిర్మించనున్నారు. జులైలో షూటింగ్‌ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి