ఇటలీలో రహస్యంగా రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రాల మ్యారేజ్!!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (09:49 IST)
FILE
గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాలు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే తమ మధ్య ఉన్న సంబంధాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ వారి గుట్టు రట్టయింది. ఎట్టకేలకు రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా ఇటలీలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

కేవలం కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక సోమవారం జరిగింది. తమమధ్య ఉన్న సంబంధాన్ని సీక్రెట్‌గా ఉంచుతూ ఎట్టకేలకు, రాణీ, ఆదిత్యలు ఓ ఇంటివారయ్యారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ సందేశంతో కూడిన ప్రకటన విడుదల చేశారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనటువంటి సంఘటన. ఈరోజు నాకు చాలా ఆనందంగా వుంది. ఈ వేడకలో తమ మామ యష్ చోప్రా లేకపోవడం విచారంగా ఉందని, యష్ అంకుల్ ఆశీస్సులు ఎప్పుడూ మాకుంటాయని ఆమె తెలిపారు.

వెబ్దునియా పై చదవండి