'లెజెండ్'కు కత్తెర.. బాలయ్యకు ఈసీ షాక్!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (11:23 IST)
FILE
సినీహీరో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. తాజాగా ఆయన నటించిన లెజెండ్ సినిమాలో కొన్నిసన్నివేశాలు తొలగించాలని ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూపురం నుంచి బాలయ్య ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో ఇందులోని కొన్ని సన్నివేశాలు ఓటర్లను ప్రభావితం చేసేలా వున్నాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

లెజెండ్ చిత్రం ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఓ ప్రత్యేక స్క్రీనింగ్ కమిటిని నియమించారు. ఆ చిత్రాన్ని చూసిన స్క్రీనింగ్ కమిటి నాలుగు సీన్స్ రాజకీయాలకు, ఓటర్లకు సంబంధించినవిగా ఉన్నాయని తెలిపింది. దీంతో వాటిని ఎన్నికలు ముగిసే వరకు తొలగిస్తామని ఈసీ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి