గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఈటీవీలో పాటలకు యాంకర్గా పలు పాత్రలు పోషించిన సునీత... నిజజీవితంలో విడాకులకోసం అభ్యర్థిస్తోందని తెలిసింది. ఎస్.పి. బాలు ప్రోత్సాహంతో సింగర్గా ఎదిగిన ఆమెకు గతంలో గాయనిగా నంది అవార్డు కూడా దక్కింది.
ఓ టీవీ ఛానల్లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉండే కిరణ్తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని సమాచారం. దీనికి కారణం... గత కొంతకాలం ఆమె వి.ఎన్. ఆదిత్య అనే దర్శకునితో సన్నిహితంగా ఉండడమేనని ఫిలిమ్ నగర్ చెవులు కొరుక్కుంటోంది.
విషయం బయటపడడంతో బెడిసికొట్టిందని ఫిలింనగర్ కథనం. ప్రస్తుతం విడాకులు కోరుకుంటుందని సమాచారం. కానీ.. ఇటువంటి సంబంధాలతో సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆడవారికి బ్యాడ్నేమ్ వస్తుందనీ, సాధ్యమైనంతవరకు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సినీ విమర్శకులు చెబుతున్నారు.