పెళ్లికి ముందే కాపురం పెట్టనున్న బాలీవుడ్ ప్రేమజంట!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (09:42 IST)
IFM
బాలీవుడ్ తారలకు పెళ్లికాకుండా కలిసిజీవించడం కొత్తేమీ కాదు. సహజీవనం అంటూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక పెళ్లికి రెడీ అవుతుంటారు. బాలీవుడ్ భామ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ చాలా కాలం సహజీవనం చేసి ఆతర్వాత పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా మరో ప్రేమజంట సహజీవనానికి శ్రీకారం చుట్టింది.

గత కొంతకాలంగా బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండలేకపోతున్నారు. అందుకే త్వరలో కాపురం పెట్టాలని ఈ జంట నిర్ణయించుకున్నారట. అందుకోసం రణబీర్ ఓ ఫ్లాట్ వేతికే పనిలోవున్నట్లు సమాచారం.

వరుస సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా వున్న వీరిద్దరికీ కలుసుకోవడానికి సమయం లేకపోవడండో పెళ్లికి ముందే కలసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ''ప్రస్తుతం తన తల్లిదండ్రులు రిషీకపూర్, నీతూసింగ్ ఉంటున్న పాలిహిల్ ఇంటి నుంచి బయటికి వెళ్లాలని రణబీర్ నిర్ణయించుకున్నాడు. కత్రినాతో కలసి ఉండేందుకు సొంత అపార్ట్ మెంట్ కొనాలని ఆలోచిస్తున్నాడు'' అని అతని దగ్గరి సన్నిహితుడొకరు తెలిపారు. అంటే, పెళ్లికి ముందే ఈ జంట కాపురం పెట్టడం ఖాయమన్నమాట.

వెబ్దునియా పై చదవండి