మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే..

శనివారం, 9 ఏప్రియల్ 2016 (09:33 IST)
ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.
 
పెద్ద పేగులోని సమస్యలకు ఖర్జూర టానిక్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబుకు ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందుగా పనిచేస్తుంది. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడితే మంచిది. చెట్టువేళ్లను నూరి పంటిలో పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.

వెబ్దునియా పై చదవండి