ఈ నేపథ్యంలో మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. పాస్పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్కు సాయం చేస్తామని ప్రకటించింది.