వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినా.. ధరలు మాత్రం ఇంకా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేవు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని ట్రాయ్ ఆలోచిస్తోంది. ట్రాయ్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది.