సమ్మర్ స్పెషల్ "మొఘలాయ్ రోజ్ షర్బత్"

గురువారం, 3 ఏప్రియల్ 2014 (17:15 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
రోజ్ సిరప్.. 3 టీ స్పూన్లు
మీగడతో ఉండే చిక్కటి పాలు.. 3 కప్పులు
మలై బర్ఫీలు.. రెండు
చక్కెర.. అర కప్పు
కుంకుమపువ్వు.. కొద్దిగా
యాలకుల పొడి.. అర టీ.
బాదంపప్పులు.. పది
పిస్తా పప్పులు.. పది


తయారీ విధానం :
ఒక పాన్‌లో పాలను పోసి వేడి చేయాలి. అందులో చక్కెరను కలిపి అది కరిగేదాకా పాలను వేడి చేసి కిందికి దించి, పక్కన ఉంచుకోవాలి. అందులో కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసి, కలియబెట్టి బాగా చల్లబడేదాకా పక్కనుంచాలి. చల్లారిన తరువా ఈ మిశ్రమంలో రోజ్ సిరప్ కూడా వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఇప్పుడు సర్వింగ్ గ్లాసులను తీసుకుని వాటిలో మలాయ్ బర్ఫీలను చితగ్గొట్టి కొద్ది కొద్దిగా వేసి.. ఫ్రిజ్‌లోంచి తీసిన పాల మిశ్రమాన్ని పోయాలి. పైన బాదం, వేయించిన పిస్తా పప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన మొఘలాయ్ రోజ్ షర్బత్ తయార్.

వెబ్దునియా పై చదవండి