ఎండాకాలం చెమట దుర్గంధం... అభ్యంగన స్నానం అవసరం... నువ్వుల నూనె రాసుకుని...

సోమవారం, 31 మార్చి 2014 (14:12 IST)
WD
ఎండాకాలం వచ్చేసింది. కొందరికి చెమట పోయడం ఓ మోతాదులో ఉంటే మరికొందరు నీళ్లు కారిపోతుంటారు. శరీరం నుంచి చెమట కారడంతో దుర్గంధం వస్తుంటుంది. అందువల్ల శరీరం దుర్వాసన పూర్తిగా తగ్గిపోవాలంటే ప్రతివారంలో ఒక్కరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని చింతపండు గానుగ గింజలు నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకుంటే చర్మం నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.

మరికొంతమందిలో విపరీతంగా చెమట పోస్తుంది. అటువంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క, నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగుపెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది.

ఇంకా చర్మంపై దురద, చిన్నచిన్న మచ్చలు వచ్చి బాధపెడుతుంటే తులసి ఆకులను నిమ్మకాయ రసంలో నూరి ఒంటికి రాసుకుని నాలుగు గంటల తర్వాత స్నానం చేస్తే దురద, చిడుములు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి