ద్రాక్ష పండ్ల రసాన్ని ముఖానికి పట్టిస్తే ఏమవుతుంది?

FILE
ముఖానికి మరింత అందం చేకూర్చాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. ఐదు లేదా ఆరు ద్రాక్ష పండ్ల రసాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయండి.

మెడ భాగంలోనూ ఈ రసాన్ని పట్టించి మర్దన చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది.

అలాగే సున్నిపిండితో గ్లిజరిన్ చేర్చి పేస్ట్‌‌లా ప్యాక్‌లా వేసుకుని మర్దన చేస్తే మీ చర్మం ఛాయ మరింత మెరుగవుతుంది. శరీరంలో నల్లగా ఉండు మోకాలికి పెరుగు లేదా నిమ్మరసాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.

ముఖంలోని మచ్చలు, మొటిమలు తొలగిపోవాలంటే నిమ్మ, తులసి రసాలను వారానికి రెండుసార్లు పట్టించి వేడినీటిలో కడిగిస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి