మీగడ - పసుపు మిశ్రమంతో చర్మానికి కాంతి!!

సోమవారం, 14 ఏప్రియల్ 2014 (14:30 IST)
File
FILE
మహిళలూ.. నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా.. అయితే ఇక మీరు బాధపడాల్సిన పనిలేదు. నల్లగా ఉన్నవారు మీగడలో పసుపు కలుపుకుని ప్రతిరోజూ చర్మానికి రాసుకుంటే మెరిసే ఛాయను పొందుతారని బ్యూటీషన్లు అంటున్నారు.

మీగడలో పసుపు కలిపి ప్రతిరోజూ చర్మానికి రాసుకుని పది నిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడక్కడ మసాజ్ చేస్తే రంగులో తేడా గమనించవచ్చు. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్లలో కలిపి రోజుకు రెండుసార్లు ముఖానికి పట్టించాలి.

20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. అలాగే బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే నలుపురంగు తగ్గిపోతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి