దేశంలో గ్యాంగ్ రేప్లు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి అమ్మాయిలు బలైనా వాటిని అరికట్టేందుకు కఠిన చట్టాలు అమల్లోకి రావట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై దొంగల ముఠా ఓ మహిళ, ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. అంతేగాకుండా ఈ దారుణ ఘటన జరిగిన ప్రాంతం దేశ రాజధాని దిల్లీకి 65 కి.మీ దూరంలో ఉంది.
వివరాల్లోకి వెళితే.. నోయిడా నుంచి షాజహాన్పూర్కు ఓ కుటుంబం కారులో వెళ్తుండగా వారి కారును దారి దోపిడీ ముఠా అడ్డగించింది. వాహనంలోని మహిళను, ఆమె 14 ఏళ్ల కుమార్తెను దోపిడీ దొంగలు బయటకు లాగారు. కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి వారి ముందే పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదు, నగలు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు.
కుటుంబసభుల్లో ఒకరు అతికష్టం మీద తాళ్లు విప్పుకొని ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి 15 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.