కోలుకున్న జయేంద్ర సరస్వతి స్వామి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:12 IST)
ఇటీవల అస్వస్థతకు లోనైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయనను గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 
 
విజయవాడ లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో చాతుర్మాస దీక్షల్లో పాల్గొనేందుకు ఆయన గత కొన్ని రోజులుగా విజయవాడలో ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. అప్పటినుంచి ఆంధ్రా ఆసుపత్రిలో చేరారు. చక్కెర, సోడియం స్థాయి పడిపోవటంతో అనారోగ్యానికి లోనయ్యారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ టి.రవిరాజు పర్యవేక్షణలో వైద్యం అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా, చాతుర్మాస దీక్షల ఈనెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి