ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రునిగా తెలుగు నేత వెంకయ్యనాయుడు మారారు. మోడీ కోర్ టీంలో ఉన్న కీలక మంత్రుల్లో వెంకయ్యనాయుడుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటీవల, ప్రతీ కార్యక్రమంలో మోడీ వెంకయ్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో, మోడీ తర్వాత వెంకయ్యకు అధిక ప్రాధాన్యం లభించింది. ఈ కార్యక్రమానికి సుష్మా స్వరాజ్తో పాటు చాలా మంది కేబినెట్ మంత్రులు హాజరైనా మోడీ వెంకయ్యకే ఇంపార్టెన్స్ ఇచ్చి కార్యక్రమానికి సారథ్యం వహించాలని కోరారు.
అలాగే, ఇటీవల ప్రధాని నివాసంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నిర్వహణ బాధ్యతలను వెంకయ్యకే అప్పగించారు. కేంద్ర కేబినెట్లో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుల అభిప్రాయాలకు మోడీ ఎక్కువ విలువను ఇస్తున్నారని పార్టీ శ్రేణుల సమాచారం.