భర్తతో గొడవపడి నాలుగు సంవత్సరాల కుమారుడితో పాటు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. భర్త తాగడం, ఆపై కొట్టి వేధించడం భరించలేకపోయిన ఆ వివాహిత బిడ్డతో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. 8 సంవత్సరాల క్రితం హేమ(26)కు సతీష్తో వివాహమైంది. వీరికి అభిలాష్ అనే కుమారుడున్నాడు.
అయితే తాగుడికి అలవాటు పడ్డ భర్త రోజూ తాగొచ్చి హేమను కొట్టేవాడు. ఆ హింసను భరించలేక ఒకసారి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అక్కడకు కూడా వచ్చిన భర్త సతీష్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన హేమ కుమారిడికి విషమిచ్చి, తాను కూడా విషం తాగేసింది. ఆపై హేమ, అభిలాష్ను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వాళ్లు మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.