సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. స్మార్ట్ ఫోన్ల మోజుతో పాటు సోషల్ మీడియాలో సెల్ఫీల పోస్టింగ్ కోసం యువత ఎగబడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నా.. సెల్ఫీల మోజు మాత్రం తగ్గట్లేదు. తాజాగా యూపీలో సెల్ఫీ పిచ్చి ఓ బాలిక ప్రమాదానికి గురయ్యేందుకు కారణమైంది. ఉత్తర ప్రదేశ్లోని భాగపత్ జిల్లాలో ఇలాంటి సెల్పీ ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.